'విశాఖ స్టీల్ ప్లాంట్ను నిర్లక్ష్యం చేయడం తగదు'
AKP: నక్కపల్లిలో ఏర్పాటు చేస్తున్న ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కు రాయితీలు ఇస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ను నిర్లక్ష్యం చేయడం తగదని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. 50,000 ఉద్యోగాలు వస్తాయని హామీ ఇచ్చిన నేపథ్యంలో 75% ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.