జిల్లాలో రేపటి నుంచి పోలీస్ చట్టం అమలు
SRD: జిల్లాలో రేపటి నుంచి 31 వరకు పోలీస్ చట్టం అమల్లో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించరాదని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఎవరైనా కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.