టెర్రస్పై గంజాయి మొక్కల పెంపకం
TG: మలక్పేట్, మహబూబ్ గంజ్ మార్కెట్లోని ఓ భవనం టెర్రస్పై బీహార్కు చెందిన ఇద్దరు వ్యక్తులు గంజాయి మొక్కలు పెంచుతుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది దాడి చేశారు. లవకుశ, భీమ్లేష్ అనే వ్యక్తులు 6 మీటర్ల ఎత్తుకు పెరిగిన గంజాయి మొక్కలను పెంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.