'వాహనదారులు హెల్మెట్ ధరించాలి'
NTR: వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం తెలిపారు. మంగళవారం సాయంత్రం ఆమె పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రాంతం వద్ద హెల్మెట్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడపటం వలన ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని అన్నారు. హెల్మెట్ పెట్టుకున్న వారిని అభినందించారు.