ATP: నేడు వైకుంఠ ద్వారదర్శన టికెట్లు విడుదల

ATP: నేడు వైకుంఠ ద్వారదర్శన టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శనాలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, శ్రీవాణి కోటా టికెట్లను నేడు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు జరిగే దర్శనాలకు ఉదయం 10 గంటలకు రోజుకు వెయ్యి చొప్పున శ్రీవాణి టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు రోజుకు 15 వేల చొప్పున రూ.300 టికెట్లు విడుదల చేయనున్నారు.