ఖతార్ గ్యాస్ ప్లాంట్పై దాడి.. భారత్పై ప్రభావమెంత?
ఖతర్లోని అతిపెద్ద LPG ప్లాంట్పై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడుల వల్ల భారత్పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఖతార్ నుంచి 40 శాతం సహజ వాయువును దిగుమతి చేసుకుంటున్నామని.. ఈ దాడులతో గ్యాస్ సరఫరా తగ్గుతుందని తెలిపారు. దీంతో దేశంలో గ్యాస్ కొరత తీవ్రతరమవుతుందని.. ప్రజలు గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు.