నేపాల్ ఆరోగ్య మంత్రిగా ఢిల్లీ ఎయిమ్స్ విద్యార్థి!
నేపాల్లో కొత్త ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత ఆ దేశ ఆరోగ్య మంత్రిగా నిషా మెహతా ప్రమాణ స్వీకారం చేశారు. ఈమెకు భారత్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 2006-10 మధ్య నిషా ఢిల్లీలోని ఎయిమ్స్ అనుబంధ కాలేజీలో నర్సింగ్ చేశారు. అనంతరం స్వదేశానికి వెళ్లి టీచింగ్ ఆసుపత్రిలో, నేపాల్ పోలీస్ వైవ్స్ అసోసియేషన్కు పరిపాలనా కార్యదర్శిగా పని చేశారు. తాజాగా ఎన్నికల్లో గెలిచారు.