గంభీర్ తన పని తాను చేస్తున్నాడు: సురేష్ రైనా
దక్షిణాఫ్రికాతో సిరీస్లో టీమిండియా ఓటమి అంచున ఉంది. ఈ నేపథ్యంలో కోచ్గా గంభీర్ను తప్పించాలని వాదనలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో గంభీర్కు మాజీ క్రికెటర్ సురేష్ రైనా మద్దతుగా నిలిచాడు. హెడ్ కోచ్గా గంభీర్ తన పని తాను చేస్తున్నాడని అన్నాడు. అతడు కోచ్గా ఉన్నప్పుడే భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచకప్, ఆసియాకప్ గెలిచిందని రైనా పేర్కొన్నాడు.