రాజస్థాన్ CSగా తెలుగు వ్యక్తి
రాజస్థాన్ సీఎస్గా 1989 బ్యాచ్కు చెందిన తెలుగు IAS అధికారి ఓరుగంటి శ్రీనివాస్ నియమితులయ్యారు. అరకులో 1966 సెప్టెంబర్ 1న జన్మించిన ఈయన.. TGలోని దుమ్ముగూడెంలో పెరిగారు. భద్రాచలంలో చదివారు. OUలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేశారు. ఈయన జాతీయస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కూడా. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనుమరాలిని వివాహం చేసుకున్నారు.