జీఎంసీ సమావేశంలో ప్రజా సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యే

జీఎంసీ సమావేశంలో ప్రజా సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యే

GNTR: గుంటూరు నగర పాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశం, బడ్జెట్‌పై నిర్వహించిన అత్యవసర సమావేశంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ అధికారులను ప్రశ్నించారు. నీటి కొరత, డ్రైనేజీ పనులు, టెండర్ ప్రక్రియలో పారదర్శకత, వీధి కుక్కల సమస్య వంటి అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.