హై టెన్షన్.. బీజేపీ కౌన్సిలర్కు తీవ్ర అస్వస్థత
NRML: ఖానాపూర్లో ఛైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. బీజేపీకి ఆధిక్యం ఉన్నా కూడా ఫలితాలు ప్రకటించకపోవడంపై కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్ లోనే బైఠాయించారు. ఈ క్రమంలో 8వ వార్డు బీజేపీ కౌన్సిలర్ సత్యవతి తీవ్ర అస్వస్థతకు లోనైంది. కౌన్సిల్ హాల్లోనే కుప్పకూలిపోయిన ఆమెను అంబులెన్స్లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.