ప్రముఖ నటుడు కన్నుమూత

పంజాబీ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు జస్విందర్ భల్లా(65) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సినిమాలతో పాటు నాటక రంగంలో జస్విందర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.