2వ విడతలో 43 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
KMR: జిల్లాలో 2వ విడత ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితానుఅధికారులు వెల్లడించారు. ఎల్లారెడ్డి,గాంధారి, నాగిరెడ్డిపేట, మహమ్మద్ నగర్, నిజాంసాగర్, పిట్లం మండలాల్లో ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి. 197 సర్పంచ్ స్థానాల్లో 43 ఏకగ్రీవంకాగా 154 సర్పంచ్ స్థానాలకు 482 మంది, 1654 వార్డు స్థానాల్లో 778 ఏకగ్రీవంకాగా 872 వార్డుస్థానాలకు 2098 మంది బరిలో నిలిచారు.