రైతు ఉత్సవాలకు తరలిన అన్నదాతలు
KNR: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నిర్వహించనున్న రైతు ఉత్సవాలకు సైదాపూర్ మండల రైతులు ఆదివారం భారీగా తరలివెళ్లారు. లస్మన్నపల్లి, వెన్నంపల్లి, ఆరెపల్లి, సోమారం, గెర్రెపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఈ వేడుకల్లో పాల్గొంటారని ఏఈవో ప్రశాంత్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే ఈ బహిరంగ సభకు రైతులు, కాంగ్రెస్ నాయకులు ఉత్సాహంగా తరలివెళ్లారు.