నేటి నుంచి యథావిధిగా మంచినీటి సరఫరా: కమిషనర్
VZM: రాజాం పట్టణంలో గురువారం నుంచి యథావిధిగా కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నట్లు మునిసిపల్ కమిషనర్ రామచంద్రరావు బుధవారం తెలిపారు.ఆయన మాట్లాడుతూ.. రేగిడి మండలం మజ్జి రాముడు పేట వద్ద ప్రధాన పైపులైను మరమ్మతు పనులు పూర్తై నేపథ్యంలో యథావిధిగా నీటిని పునరుద్ధరణ చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని గ్రహించవలసిందిగా ప్రజలను కోరారు.