ఎమ్మెల్యేను కలిసిన అయ్యప్ప భక్తులు
SRD: సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ను మంగళవారం అయ్యప్ప స్వామి భక్తులు కలిశారు. ఈ నెల 30న జరగనున్న రాము గురు స్వామి నారికేళ మహా పడిపూజ కార్యక్రమానికి సంబంధించిన అవగాహన పత్రికను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు శ్రీశైలం గౌడ్, పరమేశ్వర్ గౌడ్, విశ్వనాథరావు, సత్య నారాయణ, నాయుడు, తదితర నాయకులు పాల్గొన్నారు.