'పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి'
SDPT: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. ఇవాళ అర్బన్ మండలంలోని వెల్కటూరులో పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించి మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు.