తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ

TPT: తిరుమలలో ఈ రోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 6-8 గంటల సమయం పడుతోంది. 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,384 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,512 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.