బద్వేలు లాడ్జీలలో పోలీసుల తనిఖీలు

బద్వేలు లాడ్జీలలో పోలీసుల తనిఖీలు

KDP: ఐపీఎల్ టోర్నీ నేపథ్యంలో బద్వేలులోని లాడ్జీలు, డార్మిటరీల్లో పోలీసులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. SI కొండారెడ్డి సిబ్బందితో కలిసి బస చేసిన వారి వివరాలను, రికార్డులను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేయడంతో పాటు, అనుమానిత వ్యక్తుల వేలిముద్రలను సేకరించారు. అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు.