మీకోసం ద్వారా సమస్యలు పరిష్కారం: సబ్ కలెక్టర్
ELR: నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చన్నారు. ప్రతి సమస్యను ఆన్లైన్ చేసి, నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడం జరుగుతుందన్నారు.