ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన మంత్రిస్వామి

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో తన క్యాంపు కార్యాలయంలో మంత్రి స్వామి ఆదివారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తాను నియోజకవర్గ ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రజల ఇచ్చిన వినతి పత్రాలను ఓపిగ్గా చదివి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార దిశగా ప్రయత్నించారు. కొన్ని సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.