పోలవరం జిల్లా సమస్యలపై సీఎంకు ఎమ్మెల్యే వినతి
ASR: రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి శుక్రవారం సీఎం చంద్రబాబును కలిశారు. నూతనంగా ఏర్పాటైన పోలవరం జిల్లాకు వెంటనే అధికారులను నియమించి, కార్యాలయ భవనాలు కేటాయించాలని కోరారు. గిరిజన రైతులకు అత్యవసరమైన 'కిర్రాబు ఆనకట్ట' నిర్మాణానికి తక్షణమే ఆదేశాలివ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.