పాఠశాల ముందు బైక్ మాయం.. కేసు నమోదు
వనపర్తి జిల్లా కేంద్రంలో ఓ పాఠశాల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనం (TS 32 0570) బుధవారం చోరీకి గురైంది. పెద్దమందడి మండలం మనిగిళ్లకు చెందిన అశోక్ పాఠశాల వేడుకల కోసం వచ్చి బైక్ నిలపగా, తిరిగి వచ్చేసరికి అది కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు వనపర్తి టౌన్ ఎస్సై హరిప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.