'వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'
KMM: వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పత్తి కొనుగోలులో సీసీఐ ఆంక్షలు ఎత్తివేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఏన్కూర్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అకాల వర్షాలతో రైతుల పంటలకు తీవ్ర నష్టం జరిగిందని, వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు.