పండుగ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి

పండుగ ఏర్పాట్లను పరిశీలించిన కేంద్ర మంత్రి

SKLM: శ్రీకాకుళం నగరం అరసవల్లిలో త్వరలో జరగబోయే ఆసిరి తల్లి సిరిమాను పండుగ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం సాయంత్రం పరిశీలించారు. అరసవల్లి అమ్మవారి ఉత్సవాల పై సమీక్ష నిర్వహించారు. అనంతరం అరసవల్లిలోని పలు అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఆయనతో పాటు అధికారులు నాయకులు పాల్గొన్నారు.