బుద్ధవనాన్ని సందర్శించిన CWC డైరెక్టర్
NLG: నాగార్జునసాగర్లోని బుద్ధవనాన్ని సోమవారం సెంట్రల్ వాటర్ కమిషన్ డైరెక్టర్ ఆశిష్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ రోహిత్ సింగ్ సందర్శించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా సాగర్ చేరుకున్న అధికారులు, ముందుగా బుద్ధుని పాదాలకు వందనం సమర్పించారు. బుద్ధచరితవనం, ధ్యాన వనం, స్థూప వనాలను తిలకించారు. ఈ బృందం నేడు ప్రాజెక్టును పరిశీలించనున్నారు.