కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్యాయత్నం
ATP: గుత్తి మండలం చెరువు తండాకు చెందిన లక్ష్మీబాయి అనే మహిళ కుటుంబ కలహాల కారణంగా శనివారం విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే గుత్తి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.