బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

బావిలో దూకి వృద్ధురాలి ఆత్మహత్య

PDPL: బావిలో దూకి వృద్ధురాలు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చల్లా రాజమ్మ(78) గతకొన్ని సంవత్సరాలుగా బీపీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నది. వ్యాధుల కారణంగా మనసికంగా కృంగిపోయి జీవితంపై విరక్తి చెంది తన ఇంటికి సమీపంలో ఉన్న చేదబావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.