గ్రామీణాభివృద్ధి కోసం పని చేయాలి: ఎమ్మెల్యే
GDWL: గ్రామీణాభివృద్ధి కోసం సర్పంచులు పని చేయాలని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ సూచించారు. కేటిదొడ్డి మండలం మల్లాపురం గ్రామ సర్పంచ్గా వీరేష్, గంగన్ పల్లి గ్రామ సర్పంచిగా నర్సింహులు గెలుపొందారు. ఆదివారం వారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గెలిచిన సర్పంచ్లను శాలువా కప్పి సన్మానించారు.