అనారోగ్యంతో ఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మన్ మృతి

అనారోగ్యంతో ఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మన్ మృతి

ఖమ్మం జిల్లా మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ గోనెల విజయలక్ష్మి గురువారం అనారోగ్యంతో మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె పాల్వంచలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్న సమయంలో ఆమె ఖమ్మం జడ్పీ ఛైర్మన్‌గా పదవి స్వీకరించి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించారు.