మహిషాసుర మర్దిని అవతారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ
CTR: పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సమీపానగల శ్రీ విరుపాక్షి మారెమ్మ ఇవాళ అమావాస్య సందర్భంగా ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనం భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారిని అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.