బీజేపీ పార్టీతోనే దేశం అభివృద్ధి

నల్గొండ: BJP పార్టీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని MLC ఏబీఎన్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని SPT మార్కెట్లో BJP జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డితో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. BJP బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సూచించారు. పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించిందని పేర్కొన్నారు.