'తుఫాన్ ఎదుర్కోవడానికి సర్వం సిద్ధం'
E.G: తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా గోకవరం మండలంలో మూడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ రామకృష్ణ తెలిపారు. తంటికోండ, కామరాజుపేట, గోకవరంలో ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి అత్యవసర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు 8 ట్రాక్టర్లను, 8 జేసీబీలు, జనరేటర్ సిద్ధం చేసినట్లు తెలిపారు. త్రాగునీటి చెరువుల వద్ద రెవెన్యూ సిబ్బందిని కాపల ఉంచామన్నారు.