చేనులో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకుని రైతు మృతి
NDL: నందికొట్కూర్ పంట నష్టాలు, అప్పుల భారం, కరెంట్ షాక్లు, అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల రైతులు పొలంలోనే ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. బుధవారం నందికొట్కూర్ జూపాడుబంగ్లా పొలిమేర ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఎస్సై నరేంద్ర సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.