విద్యార్థులకు కనకమహాలక్ష్మి దర్శనం

విద్యార్థులకు కనకమహాలక్ష్మి దర్శనం

VZM: గరివిడి మండలం శ్రీరామ్ నగర్‌లోని ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లో ఉన్న సుమారు 95 మంది బధిర విద్యార్థులకు చీపురుపల్లి DSP రాఘవులు ఆధ్వర్యంలో కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం మంగళవారం కల్పించారు. దర్శనం అనంతరం ప్రసాదాలు అందించి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని వారికి సూచించారు. విద్యార్థులను సురక్షితంగా తిరిగి సెంటర్‌కు చేర్చారు.