ప్రజాదర్బార్ ద్వారా వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే
KRNL: కోడుమూరులో శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అర్జీలు స్వీకరించారు. ముఖ్యంగా కొత్త పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు, భూ సమస్యలు, నీటి కొళాయి కనెక్షన్లు, వీధి లైట్స్, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ గ్రావెల్ తదితర సమస్యపై ప్రజలు వినతిపత్రాలు అందజేశారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తప్పక పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు.