మంగినపూడి బీచ్ను అభివృద్ధి చేస్తాం: రవీంద్ర
AP: మంగినపూడి బీచ్ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్లో మంత్రి సాగర సుప్రభాత హారతితో సముద్ర స్నానాలను ప్రారంభించారు. వేదపండితుల ఆధ్వర్యంలో సముద్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సముద్ర స్నానం ఆచరించారు. తీర ప్రాంతంలో పర్యాటక అభివృద్దికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని కొనియాడారు.