వ్రతం ఎఫెక్ట్తో భారీగా పెరిగిన పూల ధరలు

VSP: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మార్కెట్లో పూల ధరలు భారీగా పెరిగాయి. ఆనందపురం హోల్ సేల్ మార్కెట్లో బంతిపూలు కేజీ రూ. 300, గులాబీ, చామంతి కేజీ రూ. 600 పలికింది. జాజులు, కనకాంబరాలు, మల్లెలు రూ.1200లకు కొనుగోలు చేశారు. కలువ పువ్వు ఒక్కోటి రూ. 50, బంతిపూల కుట్టి దండలు రూ.1300 వరకు విక్రయించారు.