మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా నిరసన
NTR: మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా తిరువూరులో సీపీఐ నేతలు శనివారం నిరసన చేపట్టారు. మెడికల్ మాఫియాపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని, ఔషధ ధరలను నియంత్రించే చట్టాలు తీసుకురావాలని, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి ప్రైవేటు ఆసుపత్రుల మాఫియాను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం సచివాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.