'వేసవి తీవ్రతపై అప్రమత్తం.. సదుపాయాలు సిద్ధం'

'వేసవి తీవ్రతపై అప్రమత్తం.. సదుపాయాలు సిద్ధం'

VSP: విశాఖలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా వడదెబ్బ బాధితులకు అగనంపూడి, గోపాలపట్నం, పెందుర్తి, భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసినట్లు డీసీహెచ్ఎస్ డా. ఆర్. నరేంద్ర సింగ్ తెలిపారు. ఐవీ ఫ్లూయిడ్స్, మందులు, ఓఆర్ఎస్ వంటి సదుపాయాలు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తిరగకుండా ఉండాలన్నారు.