రేపు సిద్ధిరామేశ్వర ఆలయం మూసివేత

రేపు సిద్ధిరామేశ్వర ఆలయం మూసివేత

KMR: బిక్కనూరులోని ప్రసిద్ధ సిద్ధరామేశ్వర ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా రేపు మూసివేస్తున్నట్లు EO శ్రీధర్ తెలిపారు. ఉ.8 గంటల నుంచి బుధవారం ఉ.6 గంటల వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆలయ శుద్ధి అనంతరం పూజలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు ఈమార్పును గమనించి సహకరించాలన్నారు.