'నీటి భద్రతపైనే భవిష్యత్ ఆధారపడి ఉంది'
PLD: నీటి వనరుల సంరక్షణపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. నాదెండ్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన 'నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ యంత్రాంగం సూచనలను ప్రజలు ఆచరణలో పెడితేనే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు.