రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై
BDK: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వాహన చోదకులకు రోడ్డు భద్రతపై టేకులపల్లి ఎస్సై రాజేందర్ నేడు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ను భారంగా భావించవద్దని సూచించారు. హెల్మెట్ ధరిస్తేనే ప్రమాద సమయాల్లో ప్రాణాపాయం తప్పుతుందని, అది మీ కుటుంబానికి రక్షణ కవచమని స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపవద్దని అన్నారు.