ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరిన లేడీ డాక్టర్
నెల్లూరుకు చెందిన ప్రముఖ డాక్టర్ ప్రత్యూష రెడ్డి టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరానన్నారు. ఆమెకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. తన మాట నమ్మి పార్టీలోకి వచ్చిన ప్రతి కార్యకర్త, నాయకుడిని గౌరవంగా చూసుకునే బాధ్యత తనదేనని కోటంరెడ్డి చెప్పారు.