రాజు సేవలను గుర్తుచేసుకున్న మోదీ
రెండో ప్రపంచ యుద్ధం వేళ గుజరాత్ మహారాజు జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్ చేసిన పనిని 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. యుద్ధ వ్యూహాలు పక్కనపెట్టి.. పోలాండ్కు చెందిన వేలాది మంది యూదు పిల్లలను ఆయన కాపాడారని కొనియాడారు. వారికి గుజరాత్లో ఆశ్రయం కల్పించి కొత్త జీవితాన్ని ఇచ్చారని, ఆ మహారాజు మానవత్వం మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తి అని మోదీ అన్నారు.