ఏయూ సంఘటనపై స్పందించిన బీజేపీ ఏపీ చీఫ్
VSP: విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాలపై జరిగిన ఘర్షణకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తీవ్రంగా స్పందించారు. స్వయం సేవక్ల సాయంశాఖ జరుగుతున్న సమయంలో కమ్యూనిస్టులు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనలో పాల్గొన్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.