నెల్లూరు నగరపాలక సంస్థలో స్వచ్ఛత వారోత్సవాలు
నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం స్వచ్ఛత వారోత్సవాలు నిర్వహించారు. మేయర్ దేవరకొండ సుజాత అశోక్ సమక్షంలో కమిషనర్ వై.ఓ నందన్ అధికారులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు సైకిల్ ప్రయాణం, ప్లాస్టిక్ నివారణ, మొక్కలు నాటడం, వ్యర్థాల పునర్వినియోగం వంటి పర్యావరణ హిత చర్యలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాలని పిలుపునిచ్చారు.