కోళ్ల వ్యాను ఢీకొని వ్యక్తి మృతి

కోళ్ల వ్యాను ఢీకొని వ్యక్తి మృతి

MDK: కౌడిపల్లి మండలం వెంకట్‌రావుపేట్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వెంకట్‌రావుపేట్ గ్రామానికి చెందిన కొన్యాల దత్తయ్య(57) నడిచి వెళ్తుండగా..రాంగ్ రూట్లో వచ్చిన కోళ్ల వ్యాన్ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే దత్తయ్యను అంబులెన్స్ వాహనంలో హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు.