ఈ నెల 12న నరసాపురంలో రేవు పాట

ఈ నెల 12న నరసాపురంలో రేవు పాట

W.G: నరసాపురం మాధవాయిపాలెం-సఖినేటిపల్లి రేవు 2026-27 సంవత్సరానికి బహిరంగ వేలం ఈ నెల 12న నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎం.నాసరు రెడ్డి ఆదివారం తెలిపారు. ఇప్పటివరకు ఏడుగురు షెడ్యూళ్లను కొనుగోలు చేశారు. నరసాపురం ఎంపీడీవో కార్యాలయంలో సీల్ కం సీక్రెట్ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తరలిరావాలని కోరారు.