ఎనుమాముల మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..!
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం వివిధ రకాల సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.6,930 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.15,500 ధర పలకగా... వండర్ హాట్(WH) మిర్చి రూ.16,200 పలికింది. తేజ మిర్చి ధర రూ.14,450 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.